![]() |
![]() |
.webp)
ఢీ 20 లేటెస్ట్ ప్రోమోలో ఆది చేసిన కామెడీ బాగా నవ్వు తెప్పించింది. ఇక కంటెస్టెంట్స్ కి రీమిక్స్ రౌండ్ కాన్సెప్ట్ ఇచ్చారు. "ప్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదర్ , విజయ్ బిన్నీ మాష్టర్ కావాలి. క్లాసికల్ కేమో నభా నటేష్ రెజీనా ఇద్దరు కావాలి" అని ఆది చెప్పాడు. "ఇంకా ఇంకేమైనా కావాలా భయ్యా" అంటూ నిఖిల్ కౌంటర్ ఇచ్చాడు. "సెంథిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి మీకు నాటు నాటు అయినా దొరుకుతాయి కానీ నా స్టెప్పులు దొరకవు" అంటూ చెన్నై చంద్రమా సాంగ్ కి ఎలా ఒంగిపోయి డాన్స్ చేయాలో చూపించాడు. తర్వాత ఒక సాంగ్ వేసుకున్నాడు " పెద్ద పెద్ద కప్పు ఉంది ఆయాసే ప్రతి ఒక్కడికీ అప్పు ఉంది ఆయాసే తేజురో రాజురో పూజరో పండురో ఉంటరో పోతరో పోతరో జతిన్ రో నీకుంటదిరో. శర్వరికి దొరుకు బిడ్డ శవాలు లేస్తాయి బిడ్డ దిశ నిన్ను ఒకేసారి ఏస్తది బిడ్డ ఏస్తది బిడ్డ" అంటూ ఊపొచ్చే పాట పాడాడు. " ఇక స్టేజి మీదకు ముగ్గురిని పిలిచారు. ఆ ముగ్గురు అబ్బాయిలకు చీరలు కట్టి దిష్టి చుక్క పెట్టాలంటూ హోస్ట్ నందు చెప్పాడు. "ద మోస్ట్ యాంటిసిపేటెడ్ పెయిర్ ఆఫ్ ఢీ 20 " అంటూ నందు అనౌన్స్ చేసాడు. తర్వాత శర్వరి - జతిన్ కలిసి రాంప్ వాక్ చేశారు.
![]() |
![]() |